రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే 52 శాతం తక్కువగా ఉందని ఐపీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కేవలం 60-65 శాతం సాగు విస్తీర్ణంలో మాత్రమే విత్తనాలు నాటారు. తక్కువ నీటితో పెరిగే 90 వేల కిలోల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి.
నిధుల కేటాయింపులో ₹310 కోట్లు DPL, ₹277 కోట్లు APHRDI, ₹171 కోట్లు APCRDA వాటా. 6,212.50 ఎకరాల ఇన్నర్ రింగ్ రోడ్ భూసేకరణ, ₹657 కోట్ల పౌల్ట్రీ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
ఒకే గ్రామ పథకాలు 13,247 నుంచి 7,439కి తగ్గి ₹3,046 కోట్లకు పరిమితం కాగా, ఐదు బహుళ గ్రామ పథకాలకు ₹1,007 కోట్లు మంజూరయ్యాయి. ₹1,811 కోట్ల విలువైన 2,943 పనుల కోసం గతంలో ఇచ్చిన జీవో 94ను రద్దు చేశారు.